ANVESHA NETRAM
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 4:37 pm Digital Edition : admin

తెలంగాణ : రబీ పంట కొనుగోలుకు కేంద్రం ఆమోదం

తెలంగాణ : రబీ పంట కొనుగోలుకు కేంద్రం ఆమోదం
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, రబీ సీజన్‌లో తెలంగాణలో 1,25,855 మెట్రిక్ టన్నుల పంటను కనీస మద్దతు ధరకు సేకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ధర మద్దతు పథకం కింద శనగలు, మినుములు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పువ్వులను కొనుగోలు చేయనున్నారు. ఈ సేకరణ విలువ రూ. 894 కోట్లకు పైగా ఉంటుంది.